వైఎస్ వివేకానందరెడ్డి మరణం సంచలనంగా మారింది. ఈ రోజు తెల్లవారి గుండెపోటుతో మరణించారని అందరూ అనుకుంటున్నారు. అయితే, అది గుండెపోటు కాదని అనుమానాస్పద మృతి అని వివేకా పిఏ కృష్ణారెడ్డి అంటున్నారు. బాత్ రూమ్ లో వివేకా రక్తపుమడుగులో పడివుండటమే తన అనుమానానికి కారణంగా పిఏ చెబుతున్నారు. వివేకా తల, చేతులపై బలమైన గాయాలున్నాయంటూ పిఏ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఏ ఫిర్యాదుతో వివేకా మరణం సంచలనంగా మారింది. రాత్రి నుండి ఉదయం వరకూ వివేకానందరెడ్డి ఇంట్లో ఏం జరిగిందనేది ఇపుడు మిస్టరీగా మారింది.  పిఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టమ్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి పోస్టుమార్టమ్ అయిన తర్వాత ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: