కర్ణాటక సీఎం కుమారస్వామి సంగతి తెలిసిందే. ఆయన చాలా సున్నిత మనస్కుడు..ఏ చిన్న కష్టం వచ్చినా ముందు కన్నీరు పెట్టుకుంటారు. అది కూడా మీడియా ఉన్నా ఏమాత్రం పట్టించుకోరు. గతంలో చాలాసార్లు ఇలా కన్నీరు పెట్టుకుంటూ వార్తల్లోకి ఎక్కారు.  ఆయన తండ్రి దేవెగౌడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు. తాజాగా ఆయన కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకీ ఇప్పుడు దేవెగౌడ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటారా.. ఆయన మనవడు ప్రజ్వల్ రేవన్న రాజకీయాల్లోకి వస్తున్నారు. 


మనవడి రాజకీయ రంగప్రవేశాన్ని వేడుకగా నిర్వహించారు. ఓ భారీ సభ పెట్టి అందులో ఈ ప్రకటన చేశారు. ఆ సమయంలోనే వెగౌడ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన మరో మనవడు, సినీహీరో నిఖిల్ గౌడ కూడా ఎంపీ ఎన్నికల్లో నిలబడుతున్నారు. ప్రజ్వల్ రేవన్న హసన్‌ నుంచి నిఖిల్ మాండ్య నుంచి ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నారు.

ఐతే.. వీరి రాజకీయ రంగ ప్రవేశంపై కర్ణాటకలో ప్రత్యర్థులు అప్పుడే నోటికి పని చెప్పారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో దేవెగౌడ చిన్నబుచ్చుకున్నారు. మనవళ్లపై వస్తున్న విమర్శలు తన మనసుని గాయపరిచాయన్నారు దేవెగౌడ.



మరింత సమాచారం తెలుసుకోండి: