దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో సంచ‌ల‌న ప‌రిణామాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న హత్యకు గురైనట్లు తేల్చిన పోస్ట్‌మార్టం ప్రాథ‌మిక నివేదిక‌లో వైద్యులు తేల్చారు. వివేకానంద గొడ్డ‌లితో దాడి చేసినట్లు నిర్ధారణ చేశారు.  ఆయ‌న శరీరంపై 7 పోట్లు ఉన్న‌ట్లు నిర్దార‌ణ చేశారు. 


ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. ఇక ఆయన నుదుటి ప్రాంతంలో... తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంపై తమకు అనుమానాలున్నాయని ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. 'మా పెదనాన్న తల మీద, చేతి వేళ్లపైన, ముఖంపైన గాయాలున్నాయి. ఎవరో దాడి చేయడం వల్లే ఆయన మరణించినట్టు ఉంది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది' అని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. 


కాగా,  పోస్ట్‌మార్టం సంద‌ర్భంగా వైద్య నివేదిక‌లో కీల‌క అంశాలు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం. వివేకానందరెడ్డిపై దాడి జ‌రిగింద‌ని, ఆయ‌న శ‌రీరంలో ఏడు క‌త్తి పోట్లు ఉన్నాయ‌ని వైద్యులు తేల్చారు.  నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఫోరెన్సిక్ వైద్యులు ప‌రీక్ష‌ల అనంత‌రం మ‌రిన్ని కీల‌క అంశాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: