వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు.. ఆయన అజాత శత్రువు అన్న పేరుంది. ఆయనతో ఎవరికీ విబేధాలు లేవు. కేవలం వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలన్న ఆలోచనతోనే ఈ హత్య చేశారా.. ఇప్పుుడు ఈకోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 



దీనికితోడు.. రాజారెడ్డి హత్యకేసులో ముద్దాయి రాగిపిండి సుధాకరరెడ్డిని ఇటీవల టీడీపీ నేతలు శిక్ష పూర్తికాక ముందే.. సత్ప్రవర్తన కింద బయటకు తీసుకొచ్చారు. ఆయన్ను బయటకు తీసుకొచ్చి మూడు నెలలకే ఈ హత్య జరగడంతో ఇప్పుడు అందరి అనుమానాలు ఆయనవైపు మళ్లుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ నేత, పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీశ్ రెడ్డి ఓ టీవీ ఛానల్‌లో సంచలన ప్రకటన చేశారు. 

Chandrababu new plan to mislead the YS Viveka Murder Case - Sakshi

వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓ చానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్‌ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. 



అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్‌ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. మరి అసలు హంతకులెవరో పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: