తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఉదంతం సంచలనం రేపుతుంది. అయితే ఈ హత్య వెనుక ఎవరు హస్తం ఉందన్న విషయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలు పలు సంచలన విషయాలు బయట పడుతున్నాయి. వివేకాను చంపడానికి ప్రత్యర్థులు పక్కా వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనపై ఏడు కత్తు పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. అయితే హత్యకు ముందు ఇంటి పరిసర ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది.
ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. సాధారణంగా వైఎస్ వివేకా ఇంటి ముందు ఉండే కుక్క కొత్త వ్యక్తులు వస్తే మొరుగుతుంది..ఈ విషయాన్ని గమనించిన నింధితులు ముందుగా ఆ కుక్కను కొట్టి చంపడం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది. రెక్కీ నిర్వహించే సమయంలోనే దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
కాగా, పోస్టుమార్టం నివేదిక రావడానికి ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది. ఇక పోస్ట్ మార్టం చేసే సమయంలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి..ఆయనను అత్యంత దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య విషయంలో ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నేడు గవర్నర్ను కలవనున్నారు.