వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.  పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. 
Image result for వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు
అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో జగన్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి.. జగన్ హైదరాబాద్ బయల్దేరనున్నారు.  

Image result for వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు

కొనసాగుతున్న దర్యాప్తు 

సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నింధితులు ఎవరు అన్న విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో  ప్రత్యేక విచారణ బృందం(సిట్) విచారణను చేపట్టిన విషయం తెలిసిందే. అన్ని కోణాల్లోను సిట్ దర్యాప్తు చేస్తోంది. వివేకా ఇంటి వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు అశోక్, డ్రైవర్ ప్రసాద్, పీఏ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సిట్ అధికారులు.



మరింత సమాచారం తెలుసుకోండి: