తన బాబాయ్ ని అత్యంత కిరాతకంగా చంపేశారు అంటూ జగన్ మోహన్ రెడ్డి వేడుకుంటున్న వేడుకోలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మినిమం కూడా కేర్ చెయ్యడం లేదు అనే మాట వినిపిస్తోంది.


పొలిటికల్ మర్డర్ గా చెబుతోన్న వై ఎస్ వివేకా మర్డర్ నిమిషా నిమిషానికి ఒక్కొక్క కొత్త మలుపు తిరుగుతూ ఉంది. రాజకీయాలలో బలా బలాలు తేల్చుకోవాలి అంటే ఎన్నికల్లో , ప్రజా క్షేత్రం లో చూసుకోవాలి తప్ప ఇలా మర్డర్ లు చెయ్యడం కరక్ట్ కాదు అనే వాదన వినపడుతోంది.


ఈ అంశం మీద మీడియా తో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ని సూటి ప్రశ్న వేసారు .. మీరు గనక ఈ విషయం లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని నమ్ముతూ ఉన్నట్టు అయితే పొలిటికల్ గా ఎందుకు భయపడుతున్న్నారు ?


సీబీఐ ఎంక్వైరీ వెయ్యడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ? రాజకీయాల్లో అన్నీ సహజం అనుకున్నప్పుడు సీబీఐ అనేది నిజాలు నిగ్గు తేల్చే సంస్థ కదా ? అనేక అంశాల్లో నిజాలని బయట పెట్టిన సంస్థ కి మీరు ఎందుకు వణుకుతున్నారు ? అంటూ స్ట్రెయిట్ ప్రశ్నలు రైజ్ చేసి జగన్ వేడి పుట్టించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: