రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా  తీసుకెళ్లారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేకానంద హత్య కేసులో నిజాలు బయటికి రావాలంటే సీబీఐకి అప్పగించాలని అన్నారు. చంద్రబాబు హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు రిపోర్టు చేయని వ్యవస్థతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. వైఎస్ వివేకానంద హత్యకేసులో న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు.

Image result for governor narasimhan

గవర్నర్ కలిసి చిన్నాన్న విషయంలో జరిగిన దారుణాన్ని వివరించామని జ‌గ‌న్ తెలిపారు. తాము అక్క‌డే ఉన్న స‌మ‌యంలోనే ఎస్‌పీకి అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని జ‌గ‌న్ తెలిపారు.  ఇంటెలిజెన్స్ డిపార్టెంట్‌ను టీడీపీకి వాచ్‌మ‌న్‌ కన్నా దారుణంగా తయారు చేశారని మండిప‌డ్డారు. 23 మంది ఎమ్మెల్యేలను అడిషనల్ డీజీ వెంకటేశ్వర రావు మాట్లాడి టీడీపీలో చేర్పించారని ఆరోపించారు.  తాము సీబీఐ విచార‌ణ కోరుతున్నామ‌ని తెలిపారు. ``నేను చంద్రబాబు ను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. సీబీఐ ఎంక్విరీ కి ఇస్తే మీకు ఏమిటి నష్టం? ఎన్నికలు అయ్యే వరకు వెంకటేశ్వర రావు లాంటి నాయకుల ను తప్పించాలని కోరుతున్నాం. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొక పోతే మేము కోర్టు కూడా వెళతాం. రెండు మూడు రోజుల్లో కోర్ట్ కూడా వెళ్ల‌నున్నాం`` అని వెల్ల‌డించారు. 

Image result for ys vivekananda reddy

``గతంలో మా తాతను వైయస్ రాజారెడ్డిని చంపారు. నాన్నను కట్టడి చేసేందుకు రిటైర్డ్ అయిపోయి ఉన్న ముసలాయనను చంపారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రతిపక్ష నేత తండ్రిని చంపారు. ముఖ్మమంత్రి ఎవరు? చంద్రబాబు. తర్వాత మా నాన్నను. అసెంబ్లీలో నాన్న చనిపోక ముందు రెండు రోజుల ముందు చంద్రబాబు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు థ్రెట్ చేశారు. తర్వాత రెండు రోజులకే హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకీ మాకు అనుమానాలు ఉన్నాయ్. ఆరోపణలు ఉన్న వ్యక్తి చంద్రబాబు. నామీద కూడా హత్యాయత్నం జరిగింది. మోస్ట్ సెక్యూర్ట్ ప్లేస్ ఎయిర్ పోర్టు. అక్కడకు కత్తి రాగలిగింది. టీడీపీ నేతల రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కత్తి తీసుకొని నా మీదకు రాగలిగాడు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంతగా దిగజారారు. ప్రతి వేలు చంద్రబాబు వైపు చూపిస్తుంటే ఎంక్వైరీ తనే చేస్తానని చంద్రబాబు చెప్పటం ఏంటి? అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా?`` అని సూటిగా ప్ర‌శ్నించారు. 


చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జ‌గ‌న్ అన్నారు. ``సహజంగా చిన్నాన్న లాంటి లీడర్లకు సెక్యూరిటీ ఇవ్వాలి. అయితే ఎందుకు ఇవ్వలేదు. సహజంగా ఎస్పీలు నియమించాక రెండు ఏళ్లు ఉంచాలి. 40 రోజుల క్రితం ఉన్న ఎస్పీని బదలాయించి ఈ ఎస్పీని తెచ్చారు. ఎస్పీ నిన్న ఓ లేఖ చూపించారు. అందులో చిన్నాన్న తన డ్రైవర్ చంపారని ఫ్యాబ్రికేటెడ్ లేఖ సృష్టించారు. ఆయన గుండెపోటు వచ్చి కప్ బోర్డుకు తగిలి చనిపోయినట్లు ఆయన బాడీని పెట్టారు. ఇంట్లో ఎవ్వరూలేరు. ఆయన ఒక్కరే ఉన్నారు. వీరు చంపుతా ఉన్నా.. చిన్నాన్న లేఖ రాస్తారా? డీఐజీ, ఎస్పీ ఓ లేఖ చూపిస్తున్నారు. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు సినిమా కథలు చెబుతున్నారు. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న. ఎలా చనిపోయారు. దీంట్లో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సీబీఐకి ఎందుకు ఇవ్వటం లేదు. సమాధానాలు రావటం లేదు`అని వైయస్ జగన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: