వైసీపీ విశాఖ అసెంబ్లీ, పార్లమెంట్ లిస్ట్ ని వైసీపీ అధినేత జగన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పదిహేను అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లు కలిగిన విశాఖ జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల వివరాలు ఇలా ఉన్నాయి.


ముందుగా అసెంబ్లీ సీట్లను చూస్తే విశాఖ సౌత్ ద్రోణం రాజు శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ అక్రమాని విజయనిర్మల, విశాఖ నార్త్ కే కే రాజు, విశాఖ వెస్ట్ మళ్ళ విజయప్రసాద్, గాజువాక తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి అదీప్ రాజు, భీమునిపట్నం అవంతి  శ్రీనివాస్, అనకాపల్లి గుడివాడ అమర్నాధ్, నర్శీపట్నం, పెట్ల ఉమా శంకర్ గణేష్, ఎలమంచిలి కన్నబాబురాజు, చోడవరం కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట గొల్ల బాబూరావు, మాడుగుల బూడి ముత్యాలునాయుడు,  పాడేరు, కే భాగ్యలక్ష్మి, అరకు చెట్టి ఫల్గుణ వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారు.


ఇక విశాఖ పార్లమెంట్ సీటు నుంచి ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ సీటు నుంచి కాండ్రేగుల సత్యవతి, అరకు పార్లమెంట్ సీటు నుంచి  గొడ్డేటి మాధవి పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. మొత్తానికి ఈ లిల్ట్ లో పాతవారు చాలా మంది ఉన్న చివరి నిముషంలో అనుకోని మార్పులు అనేకం జరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: