విజయన‌గరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు ఉన్నాయి. ఇక్కడ మొత్తం జాబితాను చూస్తే ముందుగా అనుకున్న వారిలో చాలా మందికి టికెట్లు దక్కాయి. అయితే చివరి నిముషంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి.


ఆ జాబితాను చూస్తే  కురుపాం నుంచి పాముల పుష్పవాణి, పార్వతీపురం నుంచి అలజంగి  జోగారావు,   చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణం  గజపతినగరం నుంచి బొత్స అప్పలనర్సయ్య, ఎస్‌ కోట నుంచి కే శ్రీనివాసరావు, బొబ్బిలి నుంచి ఎస్‌వీసీ అప్పలనాయుడు, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, నెల్లిమర్ల నుంచి బీ అప్పల నాయుడు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, శృంగవరపు కోట నుంచి కే శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ఇక విజయనగరం పార్లమెంట్ సీటు నుంది బెల్లల చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.


అంతా అనుకున్నవారికే ఇక్కడ సీట్లు దక్కాయన్న ఆనందం వైసీపీ వర్గాల్లో ఉంది. ఐతే కొందరు ఆశావహులకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: