పేద పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు 62 వేల మీల్స్ తయారీ.. స్థానిక స్వచ్ఛంద సంస్థకు విరాళం భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వుమెన్స్ డే సందర్భంగా పేద పిల్లల ఆకలి తీర్చేందుకు మేముసైతం అంటూ ముందుకొచ్చింది. నాట్స్ చికాగో మహిళా బృందం చికాగోలో 62 వేలమందికి ఆహారాన్ని సిద్ధం చేసి ఉచితంగా అందించింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి, సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర,  రోజా శీలంశెట్టి, కల్పన సుంకర, రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఈ ఆహారాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తమకు తెలిసిన ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడా తీసుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. ఇలా తయారైన 62 వేల మీల్స్ ను స్కాంబర్గ్ లోని మై స్టార్వింగ్ చైల్డ్ కు నాట్స్ విరాళంగా అందించింది.











మరింత సమాచారం తెలుసుకోండి: