`న‌చ్చావులే` సినిమాతో తెలుగు సినీ రంగంలో తెరంగేట్రం చేసిన హీరోయిన్ మాధ‌వీల‌త కొన్ని సామాజిక అంశాల‌పై చురుకుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేకెత్తించిన కాస్టింగ్ కౌచ్ గురించి సంచ‌ల‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ను సినీరంగంలోకి వ‌చ్చిన స‌మ‌యంలోనే మొద‌టి సినిమా డైరెక్ట‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, స‌హ‌న‌టుడు ఒక‌రు ఏకంగా డేటింగ్‌కు రావాల‌ని పిలిచార‌ని వ్యాఖ్యానించింది. అయితే అలాంటి వాట‌న్నింటినీ తాను తిర‌స్క‌రించ‌డం వ‌ల్లే అవ‌కాశాలు మిస్ అయ్యాయ‌ని చెప్పుకొచ్చింది. అనంత‌రం జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. అలా వార్త‌ల్లో నిలిచిన మాధ‌వీలత తాజాగా ఎన్నిలక‌ల బ‌రిలో నిలిచింది.


జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా పాపుల‌ర్ అయిన న‌టుడు హైప‌ర్ ఆదితో ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మాధ‌వి లత ఈ సంద‌ర్భంగా హాట్ హాట్ కామెంట్లు చేసింది. ఆ ప్రోగ్రామ్‌లో హైప‌ర్ ఆది మాధ‌విల‌త‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేయ‌గా ఆమె ఎంత‌కూ స్పందించ‌క‌పోవ‌డంతో...``నేను ఒక్క హ‌గ్ ఇస్తే ప‌డిపోతావు``అంటూ కామెంట్ చేస్తాడు. దీంతో అందుకు స్పంద‌న‌గా మాధ‌విల‌త అనూహ్య‌మైన రిప్లై ఇస్తుంది. `నేను ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే హగ్ ఇస్తా, మరెవ్వరికీ కూడా నేను హగ్ ఇవ్వను`` అంటూ షాక్ అయ్యే స‌మాధానం చెప్ప‌డంతో అవాక్కవ‌డం హైప‌ర్ ఆది వంతు అవుతుంది. ఇక్క‌డితోనే ఆపివేయ‌కుండా ప‌వ‌న్‌పై త‌న ప్రేమ‌ను మాధ‌విల‌త చాలా ఓపెన్‌గా చెప్పేస్తుంది.

ప‌వ‌న్‌ను ప్రేమించే వారు కోట్లాదిమంది ఉన్నారంటూ మాధ‌విల‌త పేర్కొంటుంది. అంతేకాకుండా ``కృష్ణుడ్ని రాధ‌ మాత్రమే కాదు, గోపికలందరూ కూడా ప్రేమించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికీ నా పక్కనే ఉన్నాడు.. నాకు మాత్రమే కనిపిస్తున్నాడు. పవన్ కల్యాణ్ నన్నెప్పటికీ మోసం చేయడు` అంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. గ‌తంలోనూ ప‌వ‌న్ ప‌ట్ల త‌న‌కు ఉన్న ఫీలింగ్‌ను ఆమె వెల్ల‌డించింది. `` పవన్ కళ్యాణ్ నాలుగో వైఫ్‌ని అని, ఇదే పనా పవన్‌కి.. ఆయన్ని నాకంటే ప్రేమించే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా అని ఆయన పరువు తీయొద్దు.. మీరు మీ పిచ్చిమాటలు. పవన్‌పై నాకున్న ప్రేమ ఫలితం ఆశించనిది. నా అభిప్రాయంలో నా లైఫ్‌లో పవన్ తప్ప ఇంకొకరు రారు లేరు అని కాదు. అది హృదయానికి సంబంధించిన ప్రేమ. నాకు షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఈ మూడు నా లైఫ్‌లో మారవు. కాశీలో వదిలేయమన్నా.. వదిలేయను’ అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేసింది.


ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాధ‌విలత‌ తాజాగా ఎన్నికల‌ బ‌రిలో నిలుస్తున్నారు. ప‌వ‌న్ ప‌ట్ల ప్రేమ‌ను వెల్ల‌డించిన ఆమె బీజేపీలో చేరారు. తాజా వెలువ‌డిన జాబితాలో ఆమెకు గుంటూరు పశ్చిమ టికెట్ ను కేటాయించారు.  రాజకీయాలకు కేంద్రబిందువైన గుంటూరులో ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజక వర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండేవిధంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: