బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. రాయలసీమ గళం వినిపించే నేతల్లో ఒకరు. ఈయన తన రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు మారారు. గతంలో తెలుగుదేశంలో ఉండేవారు. ఆ తర్వాత సొంతగా రాయలసీమ పేరిట ఓ పార్టీ కూడా పెట్టారు. దాని తరపున పోటీ కూడా చేశారు. 

byreddy rajasekhar reddy కోసం చిత్ర ఫలితం


పాపం. ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశంలోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్‌ వైపే జనం ఉంటారన్నారు.

సంబంధిత చిత్రం
అంతే కాదు.. ఆయన ఏ పార్టీలో ఉన్నా సంచలన కామెంట్స్ చేస్తుంటారు.ఇటీవల సొంత పార్టీ అధ్యక్షుడిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. రఘువీరారెడ్డి ఫేస్ వాల్యూ లేని వ్యక్తి ఆయన అధ్యక్షుడిగా ఉంటే.. పార్టీ గెలవడం కష్టం అంటూ మీడియా ముందు మాట్లాడారు. 
byreddy rajasekhar reddy కోసం చిత్ర ఫలితం

పాపం.. ఆ తర్వాత ఏమైందో. ఏమో కానీ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి మీడియాకు కనిపించడమే మానేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈ నేత జాడ ఎక్కడా కనిపించడం ేదు. ఓవైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. ఆయన మాత్రం ఇల్లు వదలడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: