బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. రాయలసీమ గళం వినిపించే నేతల్లో ఒకరు. ఈయన తన రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు మారారు. గతంలో తెలుగుదేశంలో ఉండేవారు. ఆ తర్వాత సొంతగా రాయలసీమ పేరిట ఓ పార్టీ కూడా పెట్టారు. దాని తరపున పోటీ కూడా చేశారు.
పాపం. ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశంలోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్ వైపే జనం ఉంటారన్నారు.
అంతే కాదు.. ఆయన ఏ పార్టీలో ఉన్నా సంచలన కామెంట్స్ చేస్తుంటారు.ఇటీవల సొంత పార్టీ అధ్యక్షుడిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. రఘువీరారెడ్డి ఫేస్ వాల్యూ లేని వ్యక్తి ఆయన అధ్యక్షుడిగా ఉంటే.. పార్టీ గెలవడం కష్టం అంటూ మీడియా ముందు మాట్లాడారు.
పాపం.. ఆ తర్వాత ఏమైందో. ఏమో కానీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాకు కనిపించడమే మానేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈ నేత జాడ ఎక్కడా కనిపించడం ేదు. ఓవైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. ఆయన మాత్రం ఇల్లు వదలడం లేదు.