వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. పాదయాత్రతో సామాన్యుల దగ్గరికి మరింత చేరువయ్యారు జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతగా అంటే గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే.
అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ తీవ్ర రాష్ట్రాన్ని మొత్తం అవినీతి మయం చేయడం అలాగే మరియు రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను తన స్వార్ధ రాజకీయాలకోసం చంద్రబాబు నిర్వీర్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకత నెలకొంటున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి రోజులు పడ్డాయి అని చెప్పటానికి నిదర్శనం ఏమిటంటే తాజాగా జగన్ కొయ్యలగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వచ్చిన జనాలు చూస్తుంటే జనసునామీ తలపిస్తున్నాయి.
ప్రస్తుతం పశ్చిమ జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా జగన్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తాయని సర్వేలలో తేలడంతో.. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వైసిపి పార్టీ శ్రేణులు మరియు నాయకులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పడానికి పశ్చిమ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది..
ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని స్థానాలు కట్టబెట్టినా గాని జిల్లా కి ఏమాత్రం సరైన న్యాయం చేయని చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా రాబోతున్న ఎన్నికల్లో పశ్చిమ వాసులు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నట్లు పశ్చిమ జిల్లా రాజకీయాల్లో టాక్ వినపడుతుంది. మొత్తం మీద రాయలసీమ ప్రాంతాల్లో జగన్ కి ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా పశ్చిమ లో కూడా జగన్ సభలకు వస్తున్న జనం చూస్తుంటే రాబోతున్న ఎన్నికలలో జగనే సీఎం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.