కళ్ళు ఆర్పకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వచ్చిన ప్రతి హామీని ప్రజలకు ఇవ్వటం లో చంద్రబాబుకు మించిన వారు లేరు అని చాలాసార్లు ఎన్నికల సమయంలో రుజువైన విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే ఒక్కోసారి చంద్రబాబు తాను చేసిన పొరపాటును తానే ఒప్పేసుకుంటాడు అనుకోకుండా నోరు జారి. ఈ క్రమంలో ఇటీవల ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కలెక్షన్ ప్రచారంలో భాగంగా కర్నూలులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే గౌరు చరిత నియోజకవర్గానికి అనేక పనులు చేయాలని తన దగ్గరికి వచ్చిన సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కనుక సహకరించలేదని పనులు చేయలేదని ఒప్పేసుకున్నారు చంద్రబాబు.
దీంతో ఈ వ్యాఖ్యలు విన్న సభలో ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మరోపక్క గతంలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ఇదే విషయాన్ని చాలా సార్లు అసెంబ్లీలో తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించకుండా కేవలం తన వర్గానికి తన పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని గతంలో జగన్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించలేదని ఒప్పుకోవడంతో...చంద్రబాబు అనుసరిస్తున్న రాజకీయ వైఖరి పట్ల కొంతమంది సీనియర్ నాయకులు కూడా అసహ్యించుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ చెప్పుకునే చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని..బాబుకు రోజులు దగ్గరపడ్డాయని మరికొంతమంది నేతలు కామెంట్లు చేస్తున్నారు.