ఏపీలో రాజకీయం పీక్స్ చేరింది. ఓ వైపు వేసవి ఎండలు ముందే వచ్చేశాయి. అలాగే మరో వైపు ఏపీలో ఎన్నికలు చాలా ముందుకు వచ్చాయి. దాంతో ఎక్కడ చూసిన వేడి మామూలుగా లేదుగా. ఏపీని ప్రధాన పార్టీల ప్రచారం తెగ హీటెక్కిస్తోంది. 


ఇదిలా ఉండగా ఏపీలో ఇపుడు వైసీపీ ఫీవర్ బాగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సర్వేలే కాదు. జనం కూడా అదే మాట చెబుతున్నారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో జగన్ సభలకు జనం వేలం వెర్రిగా వస్తున్నారంటే ఆ విషయం అర్ధమైపోతోంది. వైసీపీ మీద అంత ఫావర్ లేకపోతే జనం విరగ‌బడి రారు. ఇక తలపండిన రాజకీయ నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. జగన్ కూడా మరో  ఇరవై రోజులు ఓపిక పట్టండి మనదే అధికారం అంటున్నారు. 


ఇవన్నీ బాగానే ఉన్న ఇంకా ఇరవై రోజుల వరకూ టైం ఉంది. పోలింగ్ ఏప్రిల్ 11. ఇప్పటికైతే జగన్ ఊపు మాములుగా లేదు. అయితే ఈ వూపుని కంటిన్యూ చేసుకోవడంలోనే ఉంది అసలైన విజయం అంటున్నారు. అటు చూస్తే మాస్టర్ మైండ్ చంద్రబాబు ఉన్నారు. తిమ్మిని బమ్మిని చేయగల దిట్ట.  మరి వైసీపీకి ఓ విధంగా ఈ ఇరవై రోజులూ అగ్ని పరీక్షేనని అంటున్నారు. చూడాలి. మరి .



మరింత సమాచారం తెలుసుకోండి: