పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ గెలవగా..అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కనీసం జిల్లాకి ఒక్క భారీ ప్రాజెక్టు లేక అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా చేయకపోవడంతో...పశ్చిమ వాసులు చంద్రబాబు ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారట.

Related image

దీంతో పశ్చిమగోదావరి జిల్లా లో రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగిపోయే విధంగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే తెలుస్తోంది.

Image result for jagan kotagiri sridhar

ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎంపీగా కోటగిరి విద్యాధర రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ నిలబడిన నేపథ్యంలో ఎన్నికల నామినేషన్ కి కోటగిరి శ్రీధర్ వెంట పశ్చిమ వాసులు భారీగా తరలి వెళ్లడంతో ట్రాఫిక్ మొత్తం కిక్కిరిసిపోయింది రోడ్డు మొత్తం జగన్ నామస్మరణ తో కోటగిరి శ్రీధర్ పేరుతో జేజేలు కొడుతూ హడావిడి చేయడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. రాబోతున్న ఎన్నికలలో కోటగిరి శ్రీధర్ ఏలూరు కోటలో విజయ కేతనం ఎగుర వేయడం ఖాయం అని చాలామంది ఏలూరు ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: