పాపం లోకేష్ ఇప్పటికే చాలా సార్లు దొరికిపోయి కిందా మిందా పడుతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయనుండటంతో డామేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. అంబేడ్కర్ వర్థంతి శుభాకాంక్షలు.. మంచినీటి సమస్య కల్పన.. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు.. మొన్నటికి మొన్న వివేక దారణహత్యపై మాట్లాడుతూ పరవశం అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్న మాటలతో ఆయన ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. కీలకమైన ఎన్నికల డేట్ నుకూడా లోకేశ్ మర్చిపోయారా?  ఆ విషయంలోనూ కన్ఫ్యూజనా? అంటూ బుగ్గలు నొక్కుకునే పరిస్థితి.


మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

లోకేశ్ మాటలు టీడీపీ గాలి తీసేలా ఉన్నాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.వారి ఆవేదనకు తగ్గట్లే తాజా ఉదంతం చోటు చేసుకుంది. గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. ఎన్నికలు ఏప్రిల్ తొమ్మిదిన జరుగుతున్నాయని.. ఆ రోజు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆయన కోరారు.లోకేశ్ మాటల్లో తప్పు దొర్లిన విషయాన్ని గుర్తించిన అక్కడి వారు ముసిముసిగా నవ్వుకున్నారు.


మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

ఇక.. అక్కడే ఉన్న టీడీపీ నేత బండి చిరంజీవి లోకేశ్ చెవికి దగ్గరగా వెళ్లి తొమ్మిది కాదండి పదకొండు అంటూ సరిదిద్దటంతో.. తాను తప్పుగా మాట్లాడిన దాన్ని కవర్ చేసేందుకు లోకేశ్ కిందామీదా పడ్డారు. కీలకమైన ఎన్నికల పోలింగ్ తేదీని తప్పుగా చెప్పిన లోకేశ్ వ్యాఖ్యపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత .. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో ఎటకారం ఆడేశారు. నారా లోకేశ్ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ట్వీట్ చేశారు. ఈ సెటైర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయినా.. లోకేశ్ బాబు.. పోలింగ్ తేదీ మర్చిపోవటం ఏమిటి?

మరింత సమాచారం తెలుసుకోండి: