ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు పడగ విప్పయి. ముఖ్యంగా ఈ జిల్లాలో గత కొంత కాలం నుండి వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తున్న నేపథ్యంలో...రాబోతున్న ఎన్నికలలో ఎలాగైనా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అని అధికార పార్టీకి చెందిన నాయకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పుచ్చుకుంటూ దూకుడు రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నట్టు ప్రస్తుత పరిస్థితుల బట్టి అర్థమవుతుంది.

Image result for kadapa

ముఖ్యంగా వైసీపీ పార్టీ కి చెందిన వివేకానంద రెడ్డి హత్య చేయబడడం ఇప్పుడు కడప జిల్లాలో రాజకీయాలు మొత్తం రక్తసిక్తం అవుతున్నాయి. కడప జిల్లాలో వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసే వివేకానందరెడ్డిని హతమారిస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో రాజకీయాలు చేయవచ్చని వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలు తగ్గించవచ్చని భావించిన ప్రత్యర్థులు ఇటీవల వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడంతో ఇప్పుడు కడప జిల్లాలో మొత్తం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Image result for ys vivekananda reddy

ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు చేతిలో ఉన్న అధికారాన్ని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నేపథ్యంలో కడప జిల్లాలో ఉన్న సామాన్య ప్రజలు అధికార పార్టీపై మండిపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి చేసి రాజకీయాలు చేయాలని కత్తి పట్టి రక్తంతో రాజకీయాలు చేస్తే అర్థం ఉండదని రౌడీ కి రాజకీయ నేతకు తేడా ఉండదని టీడీపీ పార్టీని ఉద్దేశించి కడప జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: