జగన్‌.. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ స్థాపించి 9 ఏళ్లుగా ఆయన ప్రజల మధ్య ఉన్నారు. గత ఎన్నికల్లో కొద్దిలో అధికారం చేజిక్కించుకునే అవకాశాన్ని కోల్పోయారు. 

jagan in idupulapaya కోసం చిత్ర ఫలితం


అందుకే ఈ సారి అన్ని సమీకరణాలు, ప్రజాభిప్రాయం, సర్వేలు అన్నీ క్రోడీకరించుకుని అభ్యర్థులజాబితాలు తయారు చేశారు. అత్యధికంగా బీసీలకు 41 సీట్లు ఇచ్చారు. బలిజలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 45కు చేరుతుంది.

jagan in idupulapaya కోసం చిత్ర ఫలితం

ఇక ముస్లింలకు గతంలో ఇచ్చిన దాని కన్నా ఒక సీటు ఎక్కువగా ఇచ్చాం.. అంటే మొత్తం 5 సీట్లు మైనారిటీలకు ఇచ్చారు. అభ్యర్థుల సీట్ల ప్రకటన తర్వాత జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

jagan in idupulapaya కోసం చిత్ర ఫలితం

తన జీవితంలో ముఖ్యులందరినీ కోల్పోయానని.. తండ్రి, బాబాయిలను తలచుకుని భావోద్వేగానికిలోనయ్యారు. ఇక తనకు అన్నీ ప్రజలేనని.. ప్రజల కోసమే తన జీవితమని అన్నారు. దేవుడి దయ, నాన్న ఆశీస్సులు ఉండాలని.. వీరంతా గెలవాలని జగన్ ప్రార్థించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: