మిషన్ 150 ప్లస్.. ఇదీ చంద్రబాబు లక్ష్యం అని చెబుతుంటారు. ఆ పేరుతోనే రోజూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తారు. కానీ ఇటీవల ఆయనలో ఓటమి భయం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ సభలో ఆయన నోట ఓటమి మాట వినిపించింది. 



జనం వద్దంటే దండం పెట్టేసి వెళ్లిపోతానన్నారు చంద్రబాబు. ఈ మాటలు విన్నవారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తున్నారా అని అనుమానపడుతున్నారు. చంద్రబాబు సానుభూతి కోసం డైలాగులు కొడుతున్నారా అన్న వాదన కూడా వినిపిస్తోంది. 


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే.. మోడీ, కేసీఆర్, జగన్‌ ముగ్గురూ ముసుగు తీసి కలిసి రండి మీ కథేంటో తెల్చేస్తా. చేతనైతే ధైర్యంగా రండి పోరాడుదాం. ఒక వేళ ప్రజలొద్దంటే నమస్కారం పెడతా.. అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు దొంగలకు కాపలాదారుడిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు.



ఇక జగన్ పై కామెంట్ చేస్తూ.... సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోతే జగన్‌ డ్రామాలాడుతున్నాడని, వాళ్ల ఇంట్లో వాళ్లే చంపారని, దానిని గుండెపోటు అని చెబుతున్నారని ఆరోపించారు. రేపు మిమ్మల్నీ చంపేసి గుండెపోటు కింద తోసేస్తారని తెలిపారు. వీళ్లు వస్తే పులివెందుల మాదిరి వీధికో రౌడీ తయారవుతాడని వైఎస్సార్‌ సీపీని ఉద్దేశించి అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: