ఈ మద్య భారత దేశంలో సమాజం సిగ్గుపడేలా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా..ఇలాంటి దారుణాలు మాత్రం అరికట్టలేక పోతున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే..కామాంధులు కళ్లుమూసుకుపోయి వృద్దులు.. చిన్నారులపై కూడా లైంగిక దాడులు..అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అల్వాల్ తుర్కపల్లిలో మరో దారుణం జరిగింది.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలోని చిన్నారి మృతదేహాన్ని గాంధీ అసుపత్రికి తరలించారు.
కాగా, గురువారం హోలీ సందర్బంగా కొంత మంది బీహారీ ముఠా సభ్యులు పాపతో ఆడి సంబరాలు చేసుకున్నారు. తర్వాత పాపను చెట్ల పొదల్లోకి ఎత్తుకు వెళ్లి దారుణానికి పాల్పపడినట్లు తెలుస్తుంది. తల్లిదండ్రులు తమ కూతురి కోసం గాలింపు ప్రారంభించారు. తర్వాత పాప సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు బిహారీ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.