టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రోడ్డెక్కారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు అధినేతగా ఉన్న మోహన్ బాబు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు తన విద్యా సంస్థలకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని లేఖ రాసిన గాని సరైన స్పందన రాలేదని..చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు.

Image result for mohanbabu dharna

అంతేకాకుండా అన్ని రోజులు చంద్రబాబుకే ఉండని రోజులు మారతాయని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకు సభ్యత్వం లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మోహన్ బాబు చేశారు.

Image result for mohanbabu dharna

పిల్లల చదువు కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తూట్లు పొడుస్తున్నారని...చాలా సార్లు-డజన్ కొద్ది వినతులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనకు చంద్రబాబు అంటే ఇష్టమని కానీ ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే అసహ్యం వేస్తుందని..ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు స్పందించాలని లేకుంటే న్యాయస్థానానికి వెళ్లి పోరాటానికైనా సిద్ధమని మోహన్ బాబు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మోహన్ బాబు తో పాటు ఆయన ఇద్దరు కుమారులు మరియు కుటుంబ సభ్యులు..విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: