పవన్ కల్యాణ్ జనసేన ఇప్పుడు చంద్రబాబు భజనసేనగా మారిపోతోంది. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తానంటూ పెట్టిన పార్టీ ఇప్పుడు ప్రశ్నించడం మాని.. చంద్రబాబు పాడిన పాటనే మళ్లీ ఈయన రిపీట్ చేస్తున్నాడు. దాదాపు ఏడాది క్రితం చంద్రబాబు అవినీతిపై రెచ్చిపోయిన పవన్ ఎందుకిలా మారాడన్నది ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్థం కాని ప్రశ్న.
గతంలో పవన్ చాలా క్లారిటీగా ఉండేవాడు.. గత ఎన్నికల్లో చాలా క్లియర్ గా చంద్రబాబు, మోడీ జోడీకి సపోర్ట్ చేశాడు. విచిత్రంగా ఇప్పుడు పవన్ మళ్లీ అదే పని చేస్తున్నాడు. కాకపోతే గతంలో బాహాటంగా చేసిన పని ఇప్పుడు ముసుగులో చేస్తున్నాడని ఏపీ జనం భావిస్తున్నారు.
ఆంధ్రప్రజలు అలా భావించడానికి తగిన కారణాలే ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టుకున్న పొత్తులే అందుకు ఉదాహరణలు. బీఎస్పీ పార్టీకి 20కి పైగా అసెంబ్లీ సీట్లు ఇవ్వడంలోనే పవన్ కల్యాణ్ చేయబోతున్న రాజకీయమేంటో అర్థమైపోతోంది.
ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చాలి. వైసీపీకి వచ్చే ఓట్లు సాధ్యమైనన్ని తగ్గించాలి.. వాటిని తనవైపుకు తిప్పుకోవాలి. అల్టిమేట్ గా చంద్రబాబుకు మేలు జరగాలి..ఇదీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ వేస్తున్న ఎత్తుగడలు. అవి అర్థం చేసుకోలేనంత అమాయకులా ఆంధ్రప్రజలు.