పోలీస్ అధికారులు  పాలిటిక్స్ లో వస్తే పెదవి విప్పేందుకు చాలానే ఉంటుంది. ఎందుకంటే వారి విధి నిర్వహణ మెత్తం రాజకీయ వత్తిడులతోనే సాగుతుంది. తల వంచిన  వారు వుంటారు. వంచని వారు ఉంటారు. ఎవరిదైన ఓ ఆసక్తికరమైన కధే అవుతుంది. అందుకే పెదవి విప్పితే ప్రళయాలే వస్తాయేమో...


విశాఖ ఎంపీ సీటుకు జనసేన తరఫున మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన సీబీఐ జేడీగా అప్పట్లో పాపులర్ అయ్యారు. ఎందుకంటే ఆయన 2012 టైంలో జగన్ కేసులు డీల్ చేశారు. ఆ సందర్భంగా ఓ వర్గం ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తే మరో వర్గం ఆయన్ని వేరే విధంగా చూసింది. మరి జగన్ అవినీతి కేసులు చూసిన జేడీ ఇపుదు ఖాకీ వదిలి ఖద్దర్ ధరించానని అంటున్నారు. ఆయన నోటి వెంట జగన్ని తిట్టించి అదో రకమైన ఆనందం పొందాలని టీడీపీ పెద్దలు చూస్తున్నారు. మరి ఈ మాజీ జేడీ నాటి విషయాలపై పెదవి విప్పుతారా


నర్శీపట్నం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ జాతకం మొత్తం మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వద్ద ఉందని. ఆయన పెదవి విప్పాలని కోరారు. నిజానికి మాజీ జేడీ టీడీపీలోనే చేరుతారని  మొదట్లో న్యూస్ వచ్చింది. తరువాత ఆయన జనసేనకు షిఫ్ట్ అయ్యారు. ఇపుడు చూస్తే ఆయన జనసైనికుడు అయిపోయారు. మరో వైపు జనసేనాని పవన్ కూడా విశాఖ సభలో జగన్ గుట్టు మొత్తం చెప్పాలని కోరారు. అంటే జగన్ గురించి చెప్పడానికేనా ఈయన్ని ఇక్కడ పోటీకి దింపింది అనిపించకమానదు.


అయితే జగన్ గుట్టు విప్పితే మరిన్ని ప్రశ్నలకు కూడా ఈ మాజీ జేడీ బదులిచ్చుకోవాలంటున్నారు. వైసీపీ నేతలు. చంద్రబాబు  ఆస్తుల మీద సీబీఐ విచారణ జరిపించమంటే సిబ్బంది సరిపోరని కోర్టుకు చెప్పి అప్పట్లో ఆ పార్టీకి సానుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఈ మాజీ జేడీ మీద ఉన్నాయంటున్నారు.  ఇక జగన్ కేసు విషయంలో అప్పట్లో  ఎప్పటికపుడు మీడియాకు లీకులు ఇవ్వడం పైనా వైసీపీకి ఎన్నో  అనుమానాలూ ఉన్నాయి.


ఇక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు అయి నాటి కేసు పెట్టాయని, ఇపుడు టీడీపీ, జనసేన కుమ్మక్కు అయి విశాఖలో పోటీకి పెట్టాయని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి మాజీ జేడీ పాత విషయాలపై పెదవి విప్పు ఎన్నికల అజెండానే మారుస్తారా, లేక విశాఖ ప్రగతి మీదనే ఆయన మాట్లాడి వూరుకుంటారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: