జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలకు వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై చేస్తున్న కామెంట్లు రాష్ట్ర ప్రజలు మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నారు.

Image result for pawan serious comments

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు జగన్...అతను వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అంటున్న తరుణంలోనే..భీమవరంలో నామినేషన్ వేసిన సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా  చంద్రబాబు అందుకున్న రాగమే అందుకుని...జగన్ మరియు పులివెందుల గుండాలు భీమవరం లో అడుగు పెడితే తాట తీస్తాం తన్ని తరిమేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల గురించి...

Image result for pawan jagan

 కొన్ని స్థానాలలో నే జనసేన పార్టీ తమ అభ్యర్ధులను నిలబెట్టడం..టీడీపీ గెలిచే స్థానాలలో తన పార్టీ తరఫున డమ్మీ క్యాండెట్ నీ పోటీకి దింపడం ఇవన్నీ చూస్తుంటే చాలా మంది సామాన్య ప్రజలు టీడీపీ- జనసేన పార్టీలు ఒకటేనని బయటకు ఒకలాగా...ఉంటూ చీకటిలో ఇద్దరు కలిసే పనిచేస్తున్నారంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుని రక్షించడానికి మాత్రమే పనిచేస్తున్నట్లు ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Image result for pawan jagan

తనపై నమ్మకాన్ని మరియు అభిమానాన్ని పెట్టుకున్న ప్రజలను..రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి అమ్మకానికి పెట్టారని తన మాటలను నమ్మే ప్రజల దృష్టిలో జగన్ ని ఒక అరాచక శక్తిగా చిత్రీకరిస్తున్నారు అంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు. అయితే 2014 ఎన్నికలకు మరియు 2019 ఎన్నికలకు మధ్య ప్రజలు అంతా తెలుసుకున్నారని రాబోతున్న ఎన్నికలల్లో తగిన తీర్పు చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: