ఏపిలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్య నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది.  ప్రచారాలు ముమ్మరం చేస్తూ ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు.  ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..జనసేన అధినేత పవన్ కళ్యాన్ లు తమదైన స్టైల్లో ప్రచారాలు కొనసాగిస్తున్నారు.  ఇప్పుడు కేఏ పాల్ ‘ప్రజాశాంతి’పార్టీ తరుపు నుంచి ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ప్రచారం చాలా విచిత్రంగా ఉందని ఆంధ్రప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. 


కొంత కాలంగా వివిధ ఛానల్స్ లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే..నిజంగా నవ్వు పుట్టించేలా ఉన్నాయి.  సైకిల్ విరిగిపోతుందని..ఫ్యాన్ రెక్కలు ఊడిపోతాయని..గాజు గ్లాసు పగిలిపోతుందని..తమ పార్టీ హెలికాప్టర్ మాత్రం రివ్వున గాల్లో ఎగురుతుందని వచ్చేది ప్రజాశాంతి పార్టీ..తానే సీఎం అంటూ నానా హంగామా చేస్తున్నారు.


ఈ మద్య  పవన్‌ను విమర్శిస్తూ స్టేజిపైనే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచిన పాల్.  తాజాగా తన కారులో ప్రయాణిస్తూ గాల్లో పిడిగుద్దులు కురిపించారు. ఆపకుండా పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేశారు. వాహనదారుల్లో ఒకరు పాల్ వింత చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసి అసలు పాల్ కి ఏమైందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: