తెలంగాణ లో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. అస్సలు తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా అంటే అది లేదు. రాష్ట్రం విడిపోయినా.. తెలంగాణ - ఏపీల మధ్యన పెద్దగా వివాదాలు ఏమీ లేవు. వివాదాలు ఏమైనా ఉన్నాయంటే అవి రాజకీయ నేతలు సృష్టించినవే. రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ లోని సీమాంధ్రులు అక్కడే ఉన్నారు. ఎవరూ తరలి వెళ్లిపోలేదు. కేసీఆర్ ను తీవ్రంగా ధ్వేషించే వారు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. వారి మనుగడకు వచ్చిన ముప్పు ఏమీ లేదు.ఇక హైదరాబాద్ లో స్థిరాస్తులను కలిగిన వారు కూడా ఎంచక్కా అక్కడే ఉన్నారు.


ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?

రాష్ట్రం విడిపోయిందని ఆస్తులు అమ్ముకుని సీమాంధ్రకు వెళ్లిపోయిన సామాన్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సామాన్యులు కానీ డబ్బులున్న వాళ్లు కానీ సెలబ్రిటీలు కానీ.. ఎక్కడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. పైపెచ్చూ సీమాంధ్ర వ్యాపారులు సినిమా వాళ్లతో తెలంగాణ రాష్ట్ర సమితి వారు  చట్టాపట్టాలేసుకు తిరుగుతున్న వైనం కనిపిస్తూనే ఉంది. ఇక ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ కుటుంబం - పవన్ కల్యాణ్ స్వయంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాపురం ఉంటూ ఉన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబానికి హైదరాబాద్ లో - తెలంగాణలో ఆస్తులకు కొదవలేదు.వాటి విషయంలో పవన్ కల్యాణ్ ఏనాడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు.


ఇక మెగా ఫ్యామిలీ హీరోలంతా హైదరాబాద్ లోనే ఉంటారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మెగా ఫ్యామిలీ కేసీఆర్ తో - కేటీఆర్ తో మెయింటెయిన్ చేస్తున్న సత్సంబంధాలు మరో ఎత్తు. కేటీఆర్ తో మెగా కుటుంబీకులు ఫంక్షన్లలో సెల్ఫీలు దిగుతారు.  తన అవసరం మేరకు పవన్ కల్యాణ్ కూడా వెళ్లి కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ పాలనను అప్పుడంతా మెచ్చుకున్నారు. అప్పుడెప్పుడూ కేసీఆర్ విషయంలో ఈ తరహా ఆరోపణలు చేయలేదు కూడా!  హైదరాబాద్ లో సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నయని లేని ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం.. విమర్శలకు దారి తీస్తూ ఉంది. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ క్రెడిబులిటీ కోల్పోతున్నాడు ఈ మాటలతో అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: