ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కి రోజురోజుకి ఓటమి భయం పెరుగుతున్నట్లు ఆయన చేస్తున్న కామెంట్ బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ మీకు వద్దంటే దండం పెట్టేసి వెళ్లిపోతానంటూ చేసిన కామెంట్ లను ఉద్దేశించి చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు కి ఓడిపోతాడని ముందే తెలిసిపోయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Image result for jagan vs chandrababu

ఇందుమూలంగా నే మోడీ, కేసీఆర్, జగన్ లు కలిసి...కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలలో సానుభూతి పొందడానికి నానా తంటాలు పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోందని అంటున్నారు.  ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ ..తన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని తన ఇంటి వారే హతమరిస్తే దానిని అధికార పార్టీ పెడుతున్నారని నోటికి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతూ...తన బాబాయ్ వివేకానందరెడ్డికి జరిగినట్లు జగన్ కి జరిగితే ఏమవుతుందని సంచలన కామెంట్ చేశారట.

Image result for jagan vs chandrababu

దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. జగన్ ప్రజలను నమ్ముకున్న మనిషి అంటూ మాట్లాడుతూ నీలాగ దొంగ రాజకీయాలు చేయడం జగన్ కి చేతకాదని సంచలన వ్యాఖ్యలు చంద్రబాబుపై చేశారు. రాష్ట్రంలో ఓటమి భయంతో ఎవరు ఏం చేస్తున్నారు సామాన్య ప్రజలు ఓటర్లు గమనిస్తున్నారని కంగారు పడవద్దు అని సరైన తీర్పు రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు ఇస్తారని ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: