ఏపీలో చంద్రబాబుకు శత్రువులు ఎక్కువైపోయారా. వారంతా ఒక్కసారిగా టైం చూసుకుని మరీ మీదకు వచ్చేస్తున్నారా. రెండు రోజుల క్రితం చంద్రబాబు తాను చెప్పినట్లుగానేనే విరోధులతో ఆయన యుద్ధం చేస్తున్నారా. అసలు ఒక్క బాబుకు ఇంత మంది శత్రువులు ఎందుకు. దానికి కారణాలు ఏంటి.


చంద్రబాబును సినీ నటుడు మోహన్ బాబు ఓపెన్ చాలెంజ్ చేశారు. దమ్ముంటే చర్చకు పెట్టు, నీ ఆస్తి నా ఆస్తి, నీ నీతి నా నీతి తేల్చుకుందాం. నా జీవితం తెరచిన పుస్తకం. నీది అవినీతి చరిత్ర. ఎనీటైం.. ఎనీ ప్లేస్‌.. నువ్వే నేరుగా నాతో చర్చకు రా.. నిజానికి నా స్థాయికి నువ్వు తగవు. మాకు వచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా? ఇదీ మోహన్ బాబు లేటెస్ట్  చాలెంజ్.


నీ అడుగులకు మడుగులొత్తితే సైలెంట్‌గా ఉంటావ్‌. లేకపోతే లేనిదానిని ఉన్నట్టుగా అపనిందలు వేయిస్తావా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పదవులు ఉంటాయి పోతాయి. డబ్బు సంపాదన ఎంతవరకు జాగ్రత్త.. అన్న ఎన్టీఆర్‌కు ఏమీ చేశావో అవన్నీ చెబితే బాగుండదు. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చెయ్యగలవు. అది నన్ను చంపించడం అంతే. అంతకంటే ఏమీ చెయ్యలేవు. జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. ఇదీ మోహన్ బాబు గర్జన


తాను నోరు విప్పితే నిజాలు దొర్లుకుంటూ వస్తాయి. వాటిని విని భరించే ఓపిక నీకుందా బాబూ అంటూ మోహన్ బాబు గట్టిగానే నిలదీస్తున్నారు. మోహన్ బాబు విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో  పెట్టుకుంటే జాతకాలు మొత్తం బయటకు వస్తాయి. మరి ఆయన్ని కెలుకుతున్నారు ఇపుడు చంద్రబాబు. మరి బాబు రెచ్చ్గొడుతున్నారు. ఆయన బయటకు వచ్చి రాజకీయమే మాట్లాడితే ఈ ఎన్నికల వేళ బాబు సంగతి ఏంటో మరి. చూడాలి ఈ చాలెంజ్ కి బాబు ఎలా రెస్పాండ్ అవుతారో.



మరింత సమాచారం తెలుసుకోండి: