ఇంతకన్నా అవమానముందా! తెలంగాణాలో సముద్రం లేకనే హుసేన్ సాగర్ అంటూ ఒక సరస్సుకు సాగర్ అని పేరుపెట్టుకొని సంతృప్తి పడుతుంది తెలంగాణా. అయితే జోకర్లకే సార్వభౌముడు అనతగ్గ ఏపి ముఖ్యమంత్రి తనయుడు నోటికేదొస్తే అది మాట్లాడి మాట్లాడి క్రమంగా మతిలేని వారేమో అన్న స్థాయికి కూలిపోతున్నారు. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సానుభూతి తెలిపే క్రమంలో 'పరవశించిపోయాం' అనే పదం వాడి అడ్డంగా బుక్కయ్యారు లోకేష్. అంతేకాదు..
Lokesh comedy కోసం చిత్ర ఫలితం
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గం పేరును తప్పుగా చెప్పడంతో పాటు ఎన్నికల తేదీని కూడా తప్పుగా చెప్పిన ఘనత లోకేష్ బాబుది. ఇప్పుడు ఏకంగా నామినేషన్ సమయంలో సమర్పించిన ఒక ధ్రువపత్రంలో తండ్రి చంద్రబాబు అని రాయాల్సింది పోయి భర్త చంద్రబాబు అని పేర్కొని నవ్వుల పాలవుతున్నారు.
మళ్ళా ఇప్పుడు మరో అద్భుత వ్యాఖ్య అదీ తెలంగాణా ముఖ్యమంత్రిపై సిగ్గుమాలినట్లు... లోకేష్ ... సీఎం చంద్రబాబు కొడుకుగా, మంగళగిరి అభ్యర్థిగానే కాకుండా అతడు మరో విధంగా పాపులర్ అవుతున్నారు.
Lokesh comedy కోసం చిత్ర ఫలితం
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పైన చెప్పినట్లు  ఆయన పలుసందర్భాల్లో పప్పులో కాలేసి నవ్వులపాలు అవుతున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ప్రకటనే చేసి స్ధానికుల ముందే కాదు నెటిజన్ల ముందు కూడా నవ్వులపాలయ్యారు. మంగళగిరి ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రోడ్-షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో మచిలీపట్నం పోర్టును  తరలించుకుపోడానికే కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చుతున్నా డంటూ అసహజమైన ఆరోపణలు చేశారు. 
Lokesh comedy కోసం చిత్ర ఫలితం
దీంతో ఈ విషయం వీడియో రూపంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు సముద్ర తీరమేలేని తెలంగాణకు పోర్టును ఎలా తరలించుకు పోతారు అంటూ లోకేష్  ను ప్రశ్నిస్తూనే ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు నెటిజనులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: