లోకేష్ ఇంకా దొరుకుపోతూనే ఉన్నాడు. మంగళగిరిలో ప్రచారం చేస్తూ దానిని కామెడీషో గా మార్చేస్తున్నారు. అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తూ అప్పుడప్పడూ నవ్వులు పూయిస్తున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రకు ఎందుకు వస్తున్నారంటే.. అంటూ కారణాలు ఏకరవు పెట్టారు. కేసీఆర్ ఎన్నకల ప్రచారానికి వస్తున్నట్లుగా ఇప్పటిదాకా షెడ్యూలు లేదు. ఒకవేళ రాకపోతే.. ఈ మాటల విలువ ఏమవుతుంది? అనేది ప్రశ్న. ఒకవేళ ఈ పాయింటును విస్మరించినా.. ఆయన చెప్పిన కారణాలు.. మరీ అర్థరహితంగా, మూర్ఖత్వం అనిపించేలా ఉన్నాయి. 

Image result for lokesh

పోలవరం నిర్మాణం కాకుండా ఆపడానికి అని ఆయన అంటున్నారు. పోలవరం ఆగిపోవడం వల్ల కేసీఆర్ కు లాభమేమీ లేదు. గోదావరిని మాగ్జిమమ్ ఎంతగా వాడుకోవచ్చో.. అంతగా కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు. పోలవరం ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు తీసుకెళ్లడానికి... అని లోకేష్ అన్నారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోతే.. లేదా జగన్ గెలిస్తే.. ముంపు మండలాలు తిరిగి తెలంగాణకు ఎలా వెళ్తాయి. అవేమైనా జగన్ సొత్తా? ఇంత అర్థం లేకుండా లోకేష్ ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు.

Image result for lokesh

వాటన్నిటినీ మించిన మరో పాయింటు కూడా ఉంది.. కేసీఆర్ మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారని కూడా చినబాబు సెలవిచ్చారు. పోర్టును తెలంగాణకు తీసుకువెళ్లడం ఏమిటో... ఎలాగో ఆ దేవుడికే తెలియాలి. చినబాబు తెలివితేటలకు మరింత పెద్ద నిదర్శనం ఏంటంటే... జగన్ కు ఓటు వేయవద్దంటూ.. లోకేష్ ప్రజలను బెదిరించడానికి చెప్పిన ఈ మూడు కారణాలతోనూ మంగళగిరి నియోజకవర్గానికిక ఏ రకంగానూ సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేస్తూ... అందులోనూ ఒక రూరల్ మండలం దుగ్గిరాలలో.. గ్రామీణ ప్రజలను ఉద్దేశించి.. వారికి ఏమాత్రమూ సంబంధం లేని.. మాటలు మాట్లాడుతున్నాడంటే.. లోకేష్ ది మూర్ఖత్వం కాక మరేమవుతుంది. అని ప్రజలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: