ప్రముఖ రచయిత చిన్నికృష్ణ దర్సకుడు బోయపాటి శ్రీనుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బోయపాటి అత్యుత్సాహం వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి భక్తులు పెద్ద సంఖ్యలో చనిపోయారని ఆరోపించారు. భక్తులను చంపి.. విధవరాళ్లను చేసి ఇప్పుడు పసుపు కుంకుమ పంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత చిత్రం


గోదావరి పుష్కరాల సమయంలో బోయపాటి చంద్రబాబు హైలెట్ చేయడం కోసం.. ప్రచారం కోసం షార్ట్ ఫిల్మ్‌ తీయబోయి ప్రజలను చంపారని చిన్నికృష్ణ మండిపడ్డారు. అంతేకాదు బోయపాటి సినిమాలపైనా చిన్ని కృష్ణ ఓ రేంజ్‌లో తిట్లదండకం అందుకున్నారు. 

godavari puskaralu boyapati కోసం చిత్ర ఫలితం

అజ్ఞాని, కోపిష్టి.. అంటూ బోయపాటిని విమర్శించారు. చంద్రబాబు పాలనపైనా చిన్నికృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని.. అందులో ఏదీ రుజువు కాలేదని.. త్వరలోనే జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చిన్ని కృష్ణ అన్నారు. 

pasupu kumkuma కోసం చిత్ర ఫలితం

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తామంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు చిన్నికృష్ణ. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పవన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో తమ మీద దాడులు జరిగితే.. పవన్ వచ్చి కాపాడతారా అని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: