వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైయస్ షర్మిల అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పై మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో డైరెక్టర్ ఏది చెబితే అది డాక్టర్ చేస్తుంటారు..అయితే ప్రస్తుతం మన ఆంధ్ర రాజకీయాలు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టర్ కి.. డైరెక్టర్ చంద్రబాబు అని పేర్కొన్నారు వైయస్ షర్మిల.
రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు కి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్... ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు అంటూ..డేటా చోరీ కేసులో రాష్ట్ర సామాన్య ప్రజల సమాచారాన్ని మొత్తం ప్రవేటు సంస్థలకు అప్పజెప్పిన చంద్రబాబున్ని ఇంతవరకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని..ఎందుకంటే తన డైరెక్టర్ చంద్రబాబును ప్రశ్నిస్తే..అనేక సమస్యలు వస్తాయని..ఆ విషయాన్ని పక్కనబెట్టి పాలిటిక్స్లో బాగా నటిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు...జనసేన పార్టీకి ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు షర్మిల. మరియు అదే విధంగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును నాశనం చేసిన చంద్రబాబు...రాబోతున్న ఎన్నికల కు నన్ను గెలిపించడం మీ బాధ్యత అంటూ..ప్రజలను ఓట్లు అడగటం సిగ్గుచేటు అని అన్నారు.
మా తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటినుండి మా అన్నయ్య వైయస్ జగన్ ప్రజలనే నమ్మారని..అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ - టీడీపీలు కలిసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ..ప్రజలనే నమ్ముకుని తన తండ్రి వైయస్ రాష్ట్ర ప్రజలపై కన్న కలల కోసం కష్టపడుతున్నారు అంటూ... ప్రజల వైపు నిలబడిన జగన్ కు రాబోయే రోజుల్లో జగనన్న పడ్డ కష్టానికి ప్రజలు మంచి ఫలితాన్ని ఇస్తారని బలంగా నమ్ముతున్నానని..ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో...ఇటువంటి కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయో పార్ట్నర్ రాజకీయాలు జరుగుతున్నాయో ..వంటివి ప్రతి సామాన్యుడికి అర్థమవుతుందని పేర్కొన్నారు షర్మిల.