జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ నేడు అసెంబ్లీ నామినేషన్లకు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో జనసేన పార్టీ తుది జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా 19 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ఈరోజు విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మొదటి సారిగా ఆయన అభ్యర్థుల జాబితా ఇచ్చారు..అయితే అందులో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. జనసేన తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు.
అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు:
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
ఆలూరు- ఎస్ వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ- కెఎల్ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్ కుమార్ తలచుట్ల
నర్సీపట్నం- వేగి దివాకర్
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్ గౌతమ్
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్.దయారామ్
కుప్పం- డాక్టర్ వెంకటరమణ
జనసేన లోక్ సభ అభ్యర్థులు :
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్
హిందూపూర్- కరీముల్లా ఖాన్
నరసరావుపేట- నయూబ్ కమాల్