ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ వైసిపి పార్టీ పై దాడులకు తెగబడుతున్నట్లు ఇటీవల అనేక మంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కామెంటు చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టిడిపి గొడవలు చేసి ఎన్నికలను వాయిదా వేయించే కార్యక్రమంలో ఉన్నట్లు ఇటీవల పులివెందులలో జరిగిన మహాసభలో జగన్ కామెంట్ చేశారు.


అయితే ఆ తరువాత రాష్ట్రం మొత్తం నామినేషన్ల పర్వం కొనసాగుతున్న క్రమంలో అడపాతడపా అధికార పార్టీ టిడిపి వైసిపి పార్టీకి చెందిన నాయకుల పై చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం పరిస్థితి పోలీస్ వ్యవస్థ ఉపయోగించుకొని దాడులు చేసిన సందర్భాలు ఇటీవల మనం చూశాం. ఇదిలావుండగా తాజాగా అద్దంకి లో వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు నామినేషన్ వేసిన సందర్భంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన నాయకులు మరియు పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి దారుణంగా కొట్టారు.


దీంతో ఈ మొత్తం చూస్తున్న సామాన్య ప్రజలు చేతిలో ఉన్న అధికారాన్ని తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా దుర్వినియోగ పరుస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద అద్దంకిలో ఇబ్బందులు సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ పై గెలవాలని చూస్తుందని..కానీ ప్రజలకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు అంటూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: