టీడీపీలో లోకేష్, బాలయ్య ముఖ్య నేతలు ఒకరు సీఎంకు కొడుకు కాగా మరొకరు, మరొకరు స్టార్ హీరో ఉన్న నటుడు. అయితే ఎన్నికల ప్రచారం అయిపోయే దశకు చేరుకున్న ఇప్పటివరకు బాలకృష్ణ వేరే నియోజకవర్గాల్లో వెళ్లి ప్రచారం చేసింది లేదు. అలాగే లోకేష్ కూడా మంగళగిరి దాటి బయటికి రావటం లేదు. కేవలం సీఎం చంద్రబాబు ఒక్కడే రాష్ట్రం అంత పర్యటన చేస్తున్నాడు. 


అయితే చాలా మంది టీడీపీ నేతలు తమ నియోజక వర్గాల్లో బాలయ్య, లోకేష్ ప్రచారం వద్దని చెబుతున్నారంటా .. వీరిద్దరూ వచ్చి ఏది పడితే అది మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని నేతలు భావన. ఇప్పటికే లోకేష్ కామెడీ షో మనం మంగళగిరిలో చూస్తూనే ఉన్నాము. మాట్లాడిన ప్రతి మాట ట్రోలింగ్ కు గురి అయింది. ఎన్నికలు ఏప్రిల్ 11 అయితే ఏప్రిల్ 9 వేయాలని పిలుపునివ్వడం అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మనం చూశాము. 


అంతే కాకుండా ఇది వరకే బంధు ప్రీతీ, కుల పిచ్చి ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమే అని సెలవిచ్చిన ఘనుడు లోకేష్. అంతేనా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మన ఉరి మనమే వేసుకున్నట్టు అని చెప్పిన మేధావి లోకేష్. ఇక బాలయ్య గురించి అస్సలు చెప్పాల్సిన పని లేదు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బుల్ .. బుల్ అంటూ చేసిన కామెడీ జనాలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. దీనితో వీరిద్దరూ పార్టీ ప్రచారానికి రాకపోతేనే మంచిదని నేతలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: