ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.  ఎవరిపై ఎవరు పోటీ చేస్తారో తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కాబోయే సీఎం ఎవరు మళ్లీ చంద్రబాబేనా.. లేక జనం ఈసారి జగన్‌ కు పట్టం కడతారా అన్న ఆత్రుత, ఆసక్తి అందరిలోనూ ఉన్నాయి. 


ఈ ఉత్కంఠకు కాస్త తెరదించేందుకు అనేక సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా నరసాపురం తో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది. నరసాపురం విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బరిలో ఉన్నాయి. 

నరసాపురం నియోజకవర్గంలో ఆచంట, పాలకొల్లు, నసరాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం నరసాపురంలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ వైసీపీ ప్రధమ స్థానంలో ఉండగా.. సెకండ్ ప్లేస్ కోసం టీడీపీ, జనసేన హోరాహోరీగా తలపడుతున్నాయి. 


ఐతే.. ఈ రెండు పార్టీలూ వైసీపీకి ఆమడ దూరంలో ఉండటంతో ఇక్కడ వైసీపీ గెలుపు నూటికి నూరుశాతం ఖాయంగా తెలుస్తోంది. మెజారటీ 50 వేల నుంచి లక్ష ఓట్ల వరకూ ఉండొచ్చని ఓ అంచనా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా బరిలో ఉండటం ఇక్కడి విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: