తెలుగు సినిమా రంగానికి చెందిన సీనియర్ నటుడు మోహన్ బాబు వైసీపీ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ హైదరాబాద్ నగరంలో జగన్ తన నివాసంలో వైసిపి పార్టీ కండువా కప్పి మోహన్ బాబు ని సాదరంగా పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు తన విద్యాసంస్థల విద్యార్థులు మోసం చేశారని..


ఫీజులు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను అనేక ఇబ్బందుల పాలు చేశారు అంటూ మోహన్ బాబు చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తన విద్యాసంస్థలలో పేద విద్యార్థులకు ఎన్నో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్న మోహన్ బాబు..


రాబోతున్న ఎన్నికలలో జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని...అనేక మంది జీవితాలు వెలుగుమయం అవుతాయని...ముఖ్యంగా పేదలకు ఉన్నత విద్యలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని నేపద్యంలో తన సొంత డబ్బులతో విద్యాసంస్థల అధ్యాపకులకు జీతాలు చెల్లిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: