వైసీపీ అధినేత జగన్ గురించి జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ సంచలన కామెంట్ చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వర్క్ చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తో పాటు ఆంధ్ర రాష్ట్రం లో కలకలం సృష్టిస్తున్నాయి.


నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబోయే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న పేదలకు ప్రతి ఇంటికి ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన క్రమంలో జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మరియు జగన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫర్ ఇటీవల మాట్లాడుతూ ..కాంగ్రెస్ ఆయన్ని సీఎం చేస్తే 1500 కోట్లు ఇస్తామని జగన్ చెప్పారు. డబ్బుతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటున్నారు. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలి...అంటూ నిలదీశారు. కడపలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో నేషనల్ కాన్పరెన్స్  అధినేత ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు.ఇంత సొమ్ము ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడ రాష్ట్రం గురించే ఆలోచిస్తారని ఆయన గుర్తు చేసుకొన్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: