లాజిక్ లేని మాటలు మాట్లాడమంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మించినవాళ్ళు ఉండరు అనేది జనం లో ఎప్పుడూ వినపడే మాటే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం వేడెక్కి ఉన్న తరుణం లో ప్రతీ ఒక్కరూ చంద్రబాబు డబల్ టంగ్ గురించీ , ఆయన యూ టర్న్ రాజకీయాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు.


ఈ పొజిషన్ లో జగన్ మీద చేస్తున్న ప్రతీ ఆరోపణ గురించీ జనం కి ఫుల్ క్లారిటీ కనపడుతోంది. జగన్ ఇన్నేళ్ళ లో ఏ రోజూ మాట తప్పకుండా  , మడం తిప్పకుండా తన శైలి లో నిజాయితీగా వెళుతున్నాడు. ముఖ్యంగా ఆంధ్రులకి చాలా ముఖ్యమైన ప్రత్యెక హోదా గురించే ఎప్పటికప్పుడు పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు.


దాదాపు సంవత్సరం పాటు పాదయాత్ర చేసి జనం మనసులో నిలిచాడు జగన్ మోహన్ రెడ్డి ఈ నేపధ్యం లో జగన్ ని ఎలా అడ్డుకోవాలో తెలీని చంద్రబాబు కుట్రలు చేస్తూ , సంబంధం లేని అంశాలు ఆపాదిస్తూ జగన్ ని ఎకైకా టార్గెట్ గా చేసుకుని ముందుకి వెళుతున్నారు.



అయితే పొలిటికల్ విశ్లేషకులు మాత్రం ఒకప్పుడు చంద్రబాబు వై ఎస్సార్ మీద కూడా ఇలాగే అర్ధం లేని ఆరోపణలు చేసారు అనీ అయితే చంద్రబాబు మామ , తెలుగు దేశం వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ కంటే గొప్ప స్థాయి కి అదే వై ఎస్సార్ వెళ్ళారు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి అని అంటున్నారు. వై ఎస్ మీద ఎన్ని ఆరోపణలు చేసారో అంతకంటే వంద రెట్లు జగన్ మీద చంద్రబాబు ఆరోపణలు చెయ్యడం షాకింగ్ గా అనిపిస్తోంది. 2019 లో ముఖ్యమంత్రి పీఠం పరమావధి గా మార్చుకున్న చంద్రబాబు చేస్తున్న రాజకీయం జగన్ కి ప్లస్ అవుతుందే తప్ప మైనస్ అవ్వదు అనేది విశ్లేషకుల మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: