ఎలక్షన్ దగ్గర పడుతూ ఉండడం తో ప్రతీ రాజకీయ పార్టీ నాయకుడూ ప్రతీ విషయాన్నీ ఎలక్షన్ కోసమే వాడుకోవడం మొదలు పెట్టారు. చిన్న అంశం పెద్ద అంశం అనేది లేకుండా పొలిటికల్ గా దూసుకుపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు - జగన్ పోటా పోటీ ప్రచారాలతో ముందుకు వెళుతూ ఉంటె మరొక పక్క పవన్ కళ్యాణ్ కూడా తన సత్తా చాటడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.


రీసెంట్ గా వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీద సంచలన కామెంట్ లు చేసారు పవన్ కళ్యాణ్. "  ఎమ్మెల్యే లుగా ఉండి పోలీసుల చొక్కాలు పట్టుకుంటే మేము సైలెంట్ గా ఉండాలా? మీకెలా మర్యాద ఇస్తాం .. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే , సీఐ ల మీద దాడి చేస్తే జనం ఊరుకోరు .. పుచ్చల పల్లి సుందరయ్య లాంటి వారి నుంచి నేర్చుకోండి మీరు.


నా అభిమానిని అని చెబుతున్నాడు ఆయన . ముందు బెట్టింగ్ లు మానేసి నా అభిమానిగా చెప్పుకోమనండి. " అన్నారు పవన్ కళ్యాణ్ . నెల్లూరు సభ లో మాట్లాడిన ఆయన వైకాపా - టీడీపీ నాయకులని తూర్పారబట్టారు.



" తెలుగు దేశం నాయకులు పురుగులు పట్టిన బియ్యాన్ని రేషన్ లో పంపిస్తున్నారు .. ఇంత ఖర్మ మాకెందుకు .. రెండు వేల ఐదొందల రూపాయలకి రేషన్ బదులు డబ్బులు ఇచ్చేస్తాం మేము .. మా ఆడపడుచుల ఎకౌంటు లో ఈ డబ్బు జమ చేస్తాము .. " అని చెప్పుకొచ్చారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: