ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికాగా మారుస్తానని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని..ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు దిమ్మ తిరిగిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానని ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలియచేస్తూ ముందుకు సాగుతున్న కేఏ పాల్..తాజాగా జరుగుతున్న ఎన్నికలలో పోటీకి రెడీ అయ్యారు.


ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి పార్టీ గుర్తుగా హెలికాప్టర్ కూడా తెచ్చుకొన్నారు. అయితే కెఎ పాల్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే..ఆంధ్రరాష్ట్రంలో బలంగా ఉన్న వైసిపి పార్టీని ఢీకొట్టడానికి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి జగన్ ని దెబ్బ తీయడానికి వైసిపి పార్టీ కండువా మాదిరిగానే ప్రజాశాంతి పార్టీ కండువా ఉండేలా చూసుకుని..


మరియు వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు లాగానే తన పార్టీకి సంబంధించిన గుర్తు కూడా దరిదాపు దానికి దగ్గరగా లాగా కనిపించే హెలికాప్టర్ ని ఎంచుకున్నారని..ఇదంతా చంద్రబాబు మరియు కే ఏ పాల్  మరియు ఇతరులు కలిసి ఆడుతున్న జిమ్మిక్కులు గేమ్ అని వైసీపీ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు కె.ఎ.పాల్ పేరిట ఈ విధంగా వైసీపీ పార్టీని దెబ్బ కొట్టడానికి భారీగా కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: