హిందూపూర్ ఎంపీ బరిలో దిగిన వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ను అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసిందో అన్నీ చేశారు. కానీ అన్నింటినీ గోరంట్ల మాధవ్ న్యాయపోరాటం ద్వారా తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును పోరాడి సాధించుకున్నారు. 


ముందు ట్రైబ్యునల్‌, ఆ తర్వాత హైకోర్టులో పోరాడిన గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. గోరంట్ల మాధవ్ సీఐ నేపథ్యం.. ఆయన పోరాడిన తీరు కచ్చితంగా ఆయన్ను హీరోను చేసేశాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ గోరంట్ల మాధవ్ ఆ విషయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 

ఓ వెనుకబడిన కులానికి చెందిన లా చదువుకున్న వ్యక్తిని అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గోరంట్ల మాధవ్ ప్రచారంలో ఎండగడుతున్నారు. హైకోర్టులు చంద్రబాబు తీరును థూ అంటూ తప్పుబట్టాయని..అలాంటి నువ్వు సీఎంగా కొనసాగుతున్నావా అంటూ ప్రశ్నించారు. 

ఇక గోరంట్ల మాధవ్ లోకేశ్ పైనా విరుచుకుపడ్డారు. నోట మాట కూడా సరిగ్గా రాని లోకేశ్ ముఖ్యమంత్రి అవ్వాలా.. కోర్టులు తిట్టిన నువ్వు సీఎంవా.. కానీ లా చదువుకున్న ఓ బీసీ వ్యక్తి మాత్రం ఎంపీ కాకుడదా అంటూ ప్రజాక్షేత్రంలో రెచ్చిపోయి ప్రచారం చేస్తున్నారు.  సీఐగా రౌడీలను ఉచ్చపోయించిన నేను.. ఎంపీ కాకుడదా అంటూ మాధవ్ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: