టీడీపీ ప్రభుత్వం .. పోలీస్ వ్యవస్థను ఎంతగా నాశనం చేస్తుందో ఇప్పుడు చూస్తున్న పరిణామాలను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు ప్రజల కోసం పని చేయకుండా టీడీపీ పార్టీ కోసం పని చేయడం నిజంగా దురదృష్టకరం. ఇలా అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయని మోడీ మీద చిందులు వేసే చంద్ర బాబు తానూ చేసే పనేంటో ఇప్పుడు జనాలకు తెలిసిపోయింది. 


ఎన్నికల కమిషన్‌ పరిధి నుంచి ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతిని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో జారీచేయడం మరింత వివాదంగా మారింది. ఒక్క అధికారి.. ఒకే ఒక్క అధికారి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తోంటే, ప్రభుత్వానికి కాదు.. పార్టీకి అతనెంత కీలకం అన్నది అర్థమవుతోంది. మరో ఇద్దరు పోలీస్‌ అధికారులపైనా బదిలీ వేటుపడినా, వెంకటేశ్వరరావు వ్యవహారమ్మీదనే చంద్రబాబు అండ్‌ టీమ్‌ తెగ ఉలిక్కి పడుతోందంటే.. వ్యవహారం తేడాగా వుందనే కదా అర్థం.!


వైఎస్సార్సీపీ, బీజేపీ మాత్రమేకాదు.. ఇప్పుడంతా టీడీపీ ఆయువు పట్టు వెంకటేశ్వరరావు చేతిలో వుందనే భావనకు వచ్చేస్తున్నారు.  అయితే ఇప్పుడు ఒక వీడియోలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేవినేని అవినాష్ కు రాష్ట్ర యువనేత పదవి .. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు చెబితే వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనితో పార్టీ అవసరాల కోసం పోలీసులను ఏ విధంగా టీడీపీ వాడుకుంటుందో అర్ధం అవుతుంది. దీనితో ఎన్నికల ముందు టీడీపీ పరువు గంగలో కలిసి పోయింది. 

video url : https://www.youtube.com/watch?v=3-caFFQnTjA&feature=youtu.be

మరింత సమాచారం తెలుసుకోండి: