ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టిడిపి గతంలో తనకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి ...దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇదే క్రమంలో ఎప్పటి నుండో ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న కొడాలి నాని నాన్ లోకల్ అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీ చిత్రీకరించే కార్యక్రమాలు మొదలు పెట్టడంతో...


గుడివాడ నియోజకవర్గం లోని ప్రజలు అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ఆగడాలను ఖండిస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా అవసరం వచ్చినా ఏదైనా జరిగినా గాని కొడాలి నాని స్పందించే రాజకీయ నాయకుడని అది అందరికీ తెలిసిందే అంటూ నియోజకవర్గానికి చెందిన ప్రజలు కొడాలి నాని పై ఉన్న అభిమానాన్ని బయట పెడుతున్నారు.


అంతేకాకుండా ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఎవరో కూడా గుడివాడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సగం మందికి తెలియదని టిడిపి పార్టీ అభ్యర్థిపై సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతు ఈసారి కూడా గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: