ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఓ వీడియో వైరల్ అయింది. అది ఓ మీటింగ్. చంద్రబాబు మాట్లాడిన తెలుగుదేశం సభ అది. అందులో బాబు జగన్ పేరును వందకు పైగా వల్లించారుట. అంటే ఆ సభలో మొత్తం బాబు గంట సేపు మాట్లాడితే అందులో టీడీపీ గురించి, తన గురించి చెప్పింది చాలా తక్కువన్నమట.


ఇదే విషయాన్ని ఈ రోజు ఇడుపులపాయలో జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాస్తా సెటైరికల్ గా చెప్పుకొచ్చారు. ఏపీలో అంతా జగన్ అంటున్నారు. ఆఖరుకు చంద్రబాబు కూడా జగన్ అనే అంటున్నాడు, అందువల్ల జగన్నే గెలిపించండి  ఈసారి అంటూ విజయమ్మ ఇచ్చిన పిలుపులోనే ఉంది అసలైన పవర్ పంచ్. ఈ మాట కనుక బాబు వింటే మరెన్ని సార్లు జగన్ పేరు జపిస్తారో కదా అంటున్నారు వైసీపీ శ్రేణులు.


ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అవినీతి, అన్యాయమైన పాలన సాగుతోందని అన్నారు. నాటి వైఎస్ పాలనతో పోల్చుకుంటే ఈనాడు పాలన ఏదీ అని ఆమె ప్రశ్నించారు. బాబు దారుణంగా వ్యవహరిస్తున్నారని కూడా విజయమ్మ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు, ఆయనకు ప్రజల కష్టాలన్నీ తెలుసు. అందువల్ల వైఎస్ లాగానే ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఆయన్ని గెలిపిస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని విజయమ్మ ప్రజలకు విన్నపం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: