ప్రస్తుతం బీజేపీ పార్టీ లో ఒక వింత విషయం చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే 75 ఏళ్ళు దాటిన నేతలకు బీజేపీ పార్టీ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసిందంట. ఈ విషయంతో పార్టీ లోని దిగ్గజ నేతలంతా ఖంగు తిన్నారు. అంతే కాక ఇప్పటికే చాలా మంది నేతలు టికెట్లు రాక ఇబ్బంది పడ్డారు. అయితేనేమి బీజేపీ పార్టీ నేతలు వారి మెదడు కు పదును పెట్టీ వారు ఇంకా 75 ఏళ్ళు కంటే చిన్నవాళ్ళమే అంటూ టికెట్లు కూడా సంపాదించారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ నియోజక వర్గ భాజపా ఎంపీ టికెట్ కోసం అలాంటి పనే చేశారు.

తప్పుడు వివరాలతో ఆయన పార్టీని బోల్తా కొట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.సాగర్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఎంపీ గా ఉన్న లక్ష్మి నారాయణ్ యాదవ్ తన వయసు 74 ఏళ్లే అంటూ చెప్పుకుంటున్నారు. అయితే 2014లో ఆయన ఎన్నికల సంఘం వద్ద పొందుపరిచిన అఫిడవిట్ లో మాత్రం 73 సంవత్సరాలని ఉంది. దాంట్లో ఆయన ఏ సంవత్సరంలో జన్మించారో మాత్రం రాయకుండా వదిలేశారు. కేవలం 73 ఏళ్లని మాత్రమే రాశారు. ఇప్పుడు తనకు 74 ఏళ్లని చెబుతూ టికెట్ను సంపాదించేసారు. 

ఈ విషయం కాస్త మన మీడియా మిత్రులకు చేరింది. వారు ఆయన్ని ప్రశ్నిస్తే తాను 1944 - నవంబరు 9న జన్మించానని - 2014లో అఫిడవిట్ లో సమర్పించిన వివరాలు గుర్తు లేవని చెప్పారు. కాగా ఈ 75 ఏళ్ల నిబంధనతో లోక్సభ స్పీకర్గా పనిచేసిన సుమిత్రా మహాజన్కు కూడా పార్టీ ఇంతవరకు టికెట్ ఇవ్వలేదు. కానీ - లక్ష్మీనారాయణ యాదవ్ మాత్రం టికెట్ సాధించేశారట. అయితే ఇప్పుడీ విషయం దూమరం రేపడంతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: