కందుకూరు లో ప్రసంగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం తథ్యం అని, తర్వాత మనందరికీ తిరిగి రా శేఖర్ రెడ్డి గారి పాలనే వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

గత తొమ్మిదేళ్లలో తమ బిడ్డ అయిన వై ఎస్ జగన్ తన దగ్గర కొంత సమయం కూడా లేరని ఆమె తెలిపారు. ఎప్పుడు చూసినా జనం, జనం అని కలవరిస్తూ నెలకు 3,4 వారాలు మీ మధ్యనే తిరిగారు అని ఆమె అన్నారు. తాను జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రజల చేతిలో అతన్ని అప్పగించినట్లు విజయమ్మ అన్నారు.

జగన్ తాను చెప్పింది తప్పక చేస్తాడని, మళ్లీ తమ ప్రియత నాయకుడైన దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్లీ తేస్తాడని, ఇక మనమందరం సుఖశాంతులతో హాయిగా కాలం గడపొచ్చని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తమ ఇంట్లో చావు జరిగినా ఇప్పుడు ఆమె జనం ముందుకు రావడానికి కారణం వారు తమ కుటుంబం పైన చూపించిన ప్రేమ మాత్రమే అని విజయమ్మ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: