ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల రాజకీయ నేతలు ప్రజల మధ్య ఉంటూ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ పై రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ ప్రజల మధ్య ఉంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏవిధంగా అవినీతిమయం చేశారో వంటి విషయాలను తెలియ జేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.


ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైసిపి పార్టీ గత ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా బలంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా రైతులను మోసం చేశారు వంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కేతిరెడ్డి కి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు చంద్రబాబు అధికారంలో అడుగుపెడితే వచ్చే మార్పుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి రాష్ట్రాన్ని అన్ని విధాలా అవినీతిమయం చేసిందని మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సామాన్యుడికి తో పాటు రాష్ట్రంలో కూడా అభివృద్ధి లోకి వెళుతుందని హామీ ఇచ్చారు కేతిరెడ్డి.



మరింత సమాచారం తెలుసుకోండి: